Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 202 పాయింట్ల పతనం
ముంబయి : భారత సావరిన్ రేటింగ్ను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఎస్అండ్పీ ప్రకటించడంతో శుక్రవారం తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. అనంతరం అమ్మకాల ఒత్తిడితో తుదకు భారీ నష్టాలను చవి చూశాయి. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలను చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారు. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 202 పాయింట్లు కోల్పోయి 41,258కు పడిపోయింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు తగ్గి 12,113 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 41,702 - 41,183 మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 12,247-12091 పాయింట్ల మధ్య కదలాడింది. ఏజీఆర్ బకాయిల వసూళ్లపై ప్రభుత్వ ఉదాసీనత వైఖరీపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదే విధంగా బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడికి గురైయ్యాయి. నిఫ్టీలో అన్ని రంగాలూ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. లోహ, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ 1.25 శాతం వరకు పడిపోయాయి