Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు బీఎండబ్ల్యు శుక్రవారం భారత మార్కెట్లోకి తన నూతన ఎడిషన్ 530ఐ స్పోర్ట్స్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ప్రారంభ ధరను రూ.55.40 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.1క్షణల్లోనే అందుకుంటుందని ఆ కంపెనీ పేర్కొంది. చెన్నైలోని తన ప్లాంట్లో తయారు చేసిన ఈ కారుకు 2లీటర్ 4సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించింది. ఇది 248 బీహెచ్పీ శక్తిని 350ఎన్ఎం పీక్ టార్క్ను విడుదల చేస్తుంది.