Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల చెల్లింపునపై సుప్రీంకో ర్టు మందలింపు నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ టెలికం శాఖకు రూ.10,000 కోట్లు చెల్లించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారతి ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్ల తరపున మొత్తం రూ. 10,000 కోట్లు చెల్లించామని పేర్కొంది. తాము స్వయం మదింపు కసరత్తు చేపట్టామని, అది ముగిసిన మీదట సుప్రీంకోర్టులో తదుపరి విచారణ గడువులోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని స్పష్టం చేసింది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్టెల్ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని పేర్కొంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి రూ 35,586 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.