Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాపై సుప్రీంకో ర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2,500 కోట్లు చెల్లించేం దుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ కంపెనీ సోమవారం కోర్టును అభ్యర్తించింది. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దష్ట్యా సోమవారం రూ.2,500 కోట్లు, శుక్రవారం నాటికి మరో రూ. 1000 కోట్లు చెల్లిస్తామని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇందుకు తమకు అనుమతి ఇవ్వాలని న్యాయ స్థానాన్ని అభ్యర్థించింది. అదే విధంగా తమపై తక్షణ చర్యలు తీసుకోవద్దని వొడాఫోన్ ఐడియా కోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనలను న్యాయమూర్తి అరుణ్ మిశ్రా నేతత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల కింద వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్లు చెల్లించాల్సి ఉంది.