Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ కొత్తగా 'ఫోర్డ్ పాస్' పేరుతో తమ వినియోగదారులకు వాహన కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. యజమానులకు దూరం నుంచే వారి వాహనాన్ని వినియోగించుకునేందుకు, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ నిరీక్షించేందుకు తదితరాలకు ఈ యాప్ దోహదం చేసుతందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో ఈ కనెక్టివిటీను తన అన్ని మోడళ్లు, వేరియెంట్లలో స్టాండర్డ్ ఫీచర్గా అందిస్తున్నట్టు తెలిపింది. దీనికి యాజమానులు ఎటువంటి అదనపు రుసుము ఖర్చు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. వాహన పటిష్టత, స్థలం, ఇంధన సమాచారాన్ని కారు, ఫోర్డ్ పాస్ యాప్ మధ్య పంచుకుంటుందని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు అనురాగ్ మెహ్రొత్రా తెలిపారు. ఈ యాప్తో స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, దూరం నుంచే లాకింగ్ లేదా అన్లాకింగ్ తదితర ఫీచర్లను ఈ యాప్ కలిగి ఉంటుందన్నారు.