Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ఎల్ఈడీ బల్బుల ధరలు పెరగనున్నాయి. చైనాలో కరోనా వైరస్ ప్రభావంతో అక్కడి నుంచి సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ బల్బులు, ఇతర కాంపొనెంన్ట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎలక్ట్రిక్ ల్యాంప్ అండ్ కంపోనెంట్ మాన్ఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎల్కోమా) ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమపై ఉన్న ప్రభావం లైటింగ్ పరిశ్రమలో కూడా చోటు చేసుకుంటుందని తెలిపింది. కరోనా వైరస్ వల్ల ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, చిప్ల కొరత పెరిగిందని ఎల్కోమా వైస్ ప్రెసిడెంట్ సుమిత్ పద్మాకర్ జోషి పేర్కొన్నారు. డిమాండ్కు సరిపడ సరఫరా లేదన్నారు. ఎల్ఈడీ బల్బుల తయారీలో ఉపయోగించే 60 శాతం ఉపకరణాలను దేశీయంగా లభ్యం అయినప్పటికీ.. ఎలక్ట్రానిక్స్ డ్రైవర్స్, చిప్స్ లాంటి మరో 30 శాతం పరికరాలు చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సరఫరా తగ్గితే లైటింగ్ ఉత్పత్తుల ధరలు పెరుగొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే మార్చి నాటికి వీటి ధరల్లో 8-10 శాతం పెరుగుదల ఉండొచ్చని వారు ఆవేదన వ్యక్తం చేశారు.