Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే అయిదు నుంచి ఏడేండ్ల కాలంలో దేశంలో దాదాపు రూ.10వేల కోట్ల మేర పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా కంపెనీ చైర్మెన్ పవన్ ముంజల్ తెలిపారు. సుస్థిరమైన రవాణా పరిష్కారాలను అభివద్ధి చేసేందుకు ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నామన్నారు. మంగళవారం ఆయన మార్కెట్లోకి బీఎస్-6 ఇంజిన్తో వచ్చిన ప్యాషన్ ప్రో, గ్లామర్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. గ్లామర్ ధరల శ్రేణీ రూ.68,900 నుంచి రూ.72,400గాను, ప్యాషన్ ప్రో ధరలను రూ.64,990 - రూ.67,190గాను కంపెనీ నిర్ణయించింది. ఎక్స్ట్రీమ్ 160 మోడల్ వివరాలను సంస్థ ప్రకటించింది. దీంతో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలో తన ఉనికిని పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్టు సంస్థ స్పష్టతనిచ్చింది. కంపెనీ విద్యుత్తు వాహనాలను అభివద్ధి చేయడంతో పాటు స్టార్టప్లతో కలిసి పనిచేస్తుందన్నారు. 2011 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పరిశోధనలపై 600 మిలియన్ డాలర్ల వ్యయం చేశామని ఆయన అన్నారు మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులతో బ్రాండ్కు కొత్త ఇమేజ్ తీసుకురావడంతో పాటు 2030నాటికి కర్బన్ ఉద్గార రహిత వాహనాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.