Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జాగ్వర్ లాండ్ రోవర్ లిమిటెడ్ (జెఎల్ఆర్) కొత్తగా డ్రైవర్రహిత విద్యుత్తు కాన్సెప్ట్ కారును తయారు చేసింది. టాటా మోటార్స్కు చెందిన ఈ కంపెనీ జేఎల్ఆర్ ప్రాజెక్టు వెక్టర్లో భాగంగా అమెరికాలోని నేషనల్ ఆటోమోటివ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎన్ఏఐసీ)లో దీన్ని అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది నుంచి బ్రిటన్ రోడ్లపై పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. భవిష్యత్తు పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయదని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రల్ఫ్ స్పెత్ పేర్కొన్నారు.