Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యమహా కంపెనీతో మాక్సిస్ గ్రూపునకు చెందిన మాక్సిస్ ఇండియా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫాక్చరర్ (ఓఈఎం)గా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యమహాకు చెందిన రేజడ్ ఆర్, ఫాసినో, రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125ఎఫ్ఐ తదితర స్కూటర్ మోడళ్లకు టైర్లను సరఫరా చేయనున్నట్టు మాక్సిస్ ఇండియా తెలిపింది. ఈ శ్రేణీ స్కూటర్లకు టైర్లను అందించడానికి ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించినట్లు మాక్సిస్ ఇండియా మార్కెటింగ్ హెడ్ బింగ్ లిన్ వు తెలిపారు. ఐదేండ్లలో తమ భారత వ్యాపారంలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. 2023 నాటికి ద్విచక్ర వాహన మార్కెట్లో 15 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆ కంపెనీ పేర్కొంది.