Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రజలు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్పై (ఓబీసీ) అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని హైదరా బాద్ సర్కిల్ పరిధిలోని బ్యాంక్ ఉన్నతాధికారులు తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో జరిగిన బ్యాంక్ వార్షికోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రజలు కనబరుస్తున్న ఆదరాభిమానాల వల్లే ఓబీసీ దేశంలో మేటి బ్యాంకింగ్ సంస్థగా ఆవిషృతమైందని వారు అన్నారు. బ్యాంక్పై గత 78 వసంతాలుగా అమితమైన ప్రేమాభిమానాలను ప్రదర్శించి బ్యాంక్ను ముందుకు తీసుకుపోవడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా ఖాతాదారులు, ప్రజలు తమ బ్యాంక్ను ఇదే విధంగా ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకుపోవాలని వారు అభిలషించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ సింగ్ ఝాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉన్నతికి శ్రమిస్తున్న సిబ్బంది అందరికీ అధికారులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.