Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్ను అంచనా వేస్తున్నట్లు గోడ్రేజ్ ఇంటీరియో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) అనీల్ మథూర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటికి రూ.2400 కోట్ల రెవెన్యూ నమోదు చేసే అవకాశాలున్నాయన్నారు. దేశంలోనే తమ మూడో సోషల్వర్క్ స్సేసెస్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆఫీస్ ఫర్నిచర్ విభాగంలో తమ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు పూర్తిగా సిద్ధ్దమైనట్లు మథూర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని ఆఫీసు ఫర్నీచర్ విక్రయాల్లో రెండంకెల వృద్ధితో ఈ రంగంలో పటిష్టతను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుతం తమకు ముంబయి, కోల్కత్తాలో సోషల్ వర్క్ సెంటర్లు ఉన్నాయన్నారు. బెంగళూరు, చెన్నరు, పూణె, చంఢఘాీడ్లో కొత్త సెంటర్లను తెరవడం ద్వారా ఏడు సెంటర్లకు విస్తరించనున్నామన్నారు. సాంప్రదాయ కార్యాలయాల పరిసరాలతో పోల్చితే తాము చాలా వినూత్నంగా పనిలో ఉత్సాహాం ఉండేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ విభాగంలో రూ.200 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామన్నారు.