Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పై మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అమెజాన్ పిటిషన్తో సీసీఐ దర్యాప్తు ఉత్వర్వులపై ఇటీవల హైకోర్టు నిలుపుదల ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఫ్లిప్కార్ట్ మరో రిట్పిటీషన్ దాఖలు చేసింది. సీసీఐ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే బుర్ర వాడకుండ ఆదేశాలిచ్చింది అంటూ తన పిటిషన్లో ఫ్లిప్కార్ట్ సంచలన ఆరోపణలు చేసింది. అంతకు ముందు ఇదే విషయమై అమెజాన్ కూడా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోటీ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్ సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిబ్రవరి 10 న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఫిబ్రవరి 14న హైకోర్టు స్టే విధించింది. తాజాగా ఫ్లిప్కార్ట్ కూడా ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించడం విశేషం. ఈ కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ పిటిషన్లపై వాదలను కర్ణాటక హైకోర్టు సంయుక్తంగా వింటుందా, లేక విడివిడిగా వింటుందా అనేది చూడాలి. దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, యాంటీ ట్రస్టు ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను పక్కన పెట్టాలంటూ ఫిబ్రవరి 18న పిటిషన్ వేసింది. ఈ-కామర్స్ మేజర్లు భారీ డిస్కౌంట్లతో తమకు నష్టం కలిగిస్తున్నారన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) ఆరోపణలపై సీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత వుందని ఫ్లిప్కార్ట్ వాదించింది. అయితే పనికిమాలిన, నిరాధారమైన ఆరోపణలపై స్పందించడంలో సీసీఐ విఫలమైందని ఆరోపించింది. తద్వారా తమ ప్రతిష్టకు భంగం కలగనుందని ఫ్లిప్కార్ట్ వాదించింది.