Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: అమెరికాలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత్కు చెందిన టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు చోటు దక్కించుకుంది. ఫార్చ్యూన్ ప్రకటించిన 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' 2020 ఫార్చ్యూన్ కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారత కంపెనీగా నిలిచింది. పని చేయడానికి అత్యంత అనువైన సంస్థల జాబితాలో అగ్రశ్రేణిగా నిలిచిన 20 సంస్థల సరసన టీసీఎస్ కూడా చేరినట్లయిందని కంపెనీ తెలిపింద. బడా కంపెనీల్లో ఒకటిగా ఈ గుర్తింపును సాధించడం గర్వంగా ఉందని టీసీఎస్ ఉత్తర అమెరికా, బ్రిటన్, యూరప్ అధ్యక్షుడు సూర్య కాంత్ ఆనందం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగులందరికీ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన పని సంసృతిని సృష్టించామని అన్నారు. ఈ ఎంపికలో 60కి పైగా అంశాలను ఫార్చూన్ పరిగణలోకి తీసుకుంది. ఈ కంపెనీలో పని చేసే 72 శాతం మంది కంపెనీ సౌకర్యాలు, నిర్ణయాలపై ప్రశంసించారు.