Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం
- జాబితాలో హైదరాబాద్లోని భూములూ..!
- ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లోనూ విక్రయాలు
- వీలైతే అమ్మకం లేదంటే డెవలప్మెంట్..!
- వేగంగా పావులు కదుపుతున్న ఆర్ఎల్డీఏ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటుకు అప్పగించే ప్రక్రియ మోడీ పాలనతో తారా స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాను దాని అనుబంధ ఆస్తులను ప్రయివేటుకు అప్పగించడం మొదలు పెట్టిన సర్కారు. మరోవైపు భారత్ పెట్రోలియం సంస్థను దాని అనుబంధ ఆస్తులను ప్రయివేటుక అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సర్కారు దృష్టి రైల్వే ఆస్తులపై పడినట్టు కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలలో విలువైన భూమిని కలిగి ఉన్న రైల్వే వద్ద నుంచి వాటిని దూరం చేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సర్కారు రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ద్వారా భూములు అమ్మకాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. తాజా వ్యూహం ప్రకారం ఆర్ఎల్డీఏ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.10,000 కోట్ల విలువైన భూములను ప్రయివేటుకు విక్రయించేందుఉ గాను టెండర్లను ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది.
స్థిరాస్తి వ్యాపారుల ఒత్తిడి...
రైల్వేకు కావాల్సిన అభివృద్ధి నిధుల సమీకరణకు గాను భూములను విక్రయించాలని భావిస్తున్నట్టుగా ఆర్ఎల్డీఏ వర్గాలు చెబుతున్నప్పటికీ దీని వెనుక ప్రయివేటు రంగపు లాబీయింగ్ భారీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఆర్ఎల్డీఏ విక్రయానికి ప్రతిపాదిస్తున్న భూములలో చాలా వరకు ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి స్థిరాస్తి డిమాండ్ అధికంగా ఉన్న నగరాల్లోని ల్యాండ్పూల్స్నే అధికారులు ఎంపిక చేశారు. మొత్తంగా ఈ ఏడాది విక్రయానికి గానువాణిజ్య ప్రదేశాలలోని భూములను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భూములను అవసరమైతే అమ్మేయడం, లేదా డెవలపర్ల భాగస్వామ్యంతో వాటిని అభివృద్ధిచేసి వాణిజ్య అవసరాలకు వినియోగించడం వంటి ప్రతిపాదనలు కూడా ఆర్ఎల్డీఏ సిద్ధం చేసినట్టుగా సమాచారం. భూమలును కొనుగోలు పెట్టడం వల్ల డెవలపర్లు విశ్వాసంగా ముందుకు వచ్చి వాటిని అభివృద్ధి చేస్తారని ఫలితంగా ఆయా ప్రాంతాలు వాణిజ్య పరంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
74 వాణిజ్య ప్రదేశాలే టార్గెట్..
ఖాళీ ప్రదేశాల విక్రయంతో పాటు దేశ వ్యాప్తంగా 74 ప్రధాన వాణిజ్య కూడళ్లలో ఉన్న వాణిజ్య ప్రదేశాలను, రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి పేరుతో ప్రయివేటుకు అప్పగించే పనులు వేగంగా సాగుతున్నట్టుగా సమాచారం. ఈ కొత్త ప్రయోగానికి గత వారం శ్రీకారం చుట్టిన ఆర్ఎల్డీఏ ఢిల్లీలోని అశోక్ విహార్లఓ గల దాదాపు 10.76 ఎకరాల భూమిని వాణిజ్య పరంగా అభివృద్ధిపరచడం పేరుతో ఆర్ఎల్డీఏ గోద్రేజ్ ప్రాపర్టీస్కు అప్పగించింది. ఇదే మాదిరిగా రానున్న రోజుల్లో వివిధ ఇతర ప్రాంతాల్లోని భూములను కూడా ప్రయివేటకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం.
విక్రయానికి 55 స్టేషన్లు
ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తున్నట్టుగా ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయానికి పెడుతోంది. రైల్వే భూములను పర్యవేక్షించే ఆర్ఎల్డీఏకు దేశంలో దాదాపు 43,000 హెక్టార్లా అదనపు భూములు ఉన్నాయి. వీటిని భవిష్యత్తు అవసరాల కోసం, విస్తరణ పనుల కోసం కాపాడుకోవాలని రైల్వే వర్గాలు గత కొన్ని దశాబ్దాలుగా వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే మోడీ సర్కారు తాజాగా వాటిని విక్రయానికి పెట్టడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మోడీ సర్కారు చర్యల వల్ల పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా రైల్వేను విస్తరిచేం దుకు తగిన ఆస్కారం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎల్డీఏ ద్వారా రైల్వే భూములను విక్రయించడం లేదా డవలప్మెంట్ పేరుతో ప్రయివేటుకు అప్పగించాలన్న ఆలోచన ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. తాజా వ్యూహం ప్రకారం ఆర్ఎల్డీఏ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా దాదాపు 55 రైల్వే స్టేషన్లను ప్రయివేటుకు అప్పగించేందుకు సైతం రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం. వీటిని ప్రయివేటుకు అప్పగించడం ద్వారా రైల్వే కాలనీస్ను అభి వృద్ధి చేయాలన్నది తమ ఆలోచన అని ఆర్ఎల్డీఏ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము రూ.1600 కోట్ల విలువైన టెండర్లను ఆవార్డ్ చేసిన ట్టుగా తెలిపారు. మార్చి ముగింపు నాటికి దీనిని రూ.1850 కోట్లకు చేర్చను న్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రయివేటుకు అభివృద్ధి కార్యక్రమాలను అప్పగించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని రైల్వే కాలనీలలో కొంత భూమిని వారు తీసుకొని అభివృద్ధి చేస్తారని. మిగతా ప్రాంతాల్లోని రైల్వే కాలనీలు, కా ర్యాలయాలను కూడా వారు అభివృద్ధి చేసి తమకు అప్పగించేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా ఆర్ఎల్డీఏ చెబుతోంది.