Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలో ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువవుతున్నాయి. పండించే పంట మొదలుకుని ముఖానికి రక్షణగా కప్పుకునే మాస్కులు సైతం విదేశాలనుంచే దిగుమతి అవుతున్నాయి. విదేశాలలో వచ్చే జబ్బులను సైతం బడా సంస్థలు వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. కరోనా వైరస్తో పాటు ఇంతకు ముందు వచ్చిన స్వైన్ ఫ్లూ, జికా వైరస్లను భయపెట్టి ఇటు కార్పొరేట్ దవాఖానాలు, మాస్కు తయారీ సంస్థలు దండుకున్నాయి. జబ్బులొచ్చినా కాలుష్యం పెరిగినా మాస్కులు భారీగా దిగుమతి అవుతున్నాయి. 2017..18లో 1189 కోట్ల మేర మాస్కులు విక్రయాలు జరగ్గా,2018..19 డిసెంబర్ నాటికి 1610 కోట్లు విక్రయాలు జరిగాయని అధికారవర్గాలు తెలిపాయి.