Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం 12 శాతం పన్ను..అదనంగా 16శాతం
- మార్చి ఒకటి నుంచి కొత్త పన్ను విధానం
న్యూఢిల్లీ : సందు దొరికితే చాలు భారాలు వేయటం తప్ప సామాన్యుల గురించి మోడీ సర్కార్ పట్టించుకోవటంలేదన్నది నిర్వివాదాంశం. రాష్ట్రాల నుంచి సేకరించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ)లో వాటా ఇవ్వకుండా కేంద్రం నాన్చుతూనే ఉన్నది. తాజాగా మరో జీఎస్టీ భారాన్ని మోపటానికి రెడీ అయిపోయింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. రాష్ట్రాల నిర్వహరణలో ఉన్నా...లేక ఆధీకృత లాటరీలపై 28 శాతం శ్లాబ్లో ఒకే పన్నును విధించాలని గతేడాది(2019) డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీపై 12 శాతం పన్ను ఉండగా, రాష్ట్ర అధీకృత లాటరీపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. లాటరీలపై ఏకరీతి పన్ను ఉండాలనే పెద్దల డిమాండ్ల నేపథ్యంలో మంత్రుల బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ బృంద ఇచ్చిన సిఫారసులతో లాటరీలపై 28 శాతం యూనిఫాం రేటుతో పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికనుగుణంగా మార్చి ఒకటి నుంచి లాటరీలపై నూతన పన్ను విధానం అమల్లోకి రానున్నది. దీనికనుగుణంగా కేంద్ర రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.