Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ శక్తికాంత్దాస్
ఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఆర్బీఐ తర్జనభర్జన పడుతున్నది. దీనిలో భాగంగా ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు, వాటిని ప్రభావితం చేసే సంబంధిత విభాగాల గురించి జూన్లో కేంద్ర ప్రభుత్వం చర్చించనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాని ద్వారా రెపోరేటును నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కమిటీ తొలిసారి 2016 అక్టోబర్లో భేటీ అయింది. వచ్చే మార్చి నాటికి వార్షిక ద్రవ్యోల్బణం నాలుగు శాతం వద్ద కట్టడి చేయాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.
''మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అమలు చేయడం మొదలుపెట్టి మూడున్నరేండ్లు పూర్తైంది. ఈ విధానం ఎలా పనిచేస్తున్నదన్న అంశంపై అంతర్గత సమీక్షను షురూ చేశాం. ఈ ఏడాది జూన్ లేదా ఆ తర్వాత .. దీనికి సంబంధించిన అన్ని వర్గాలు, నిపుణులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. పరపతి విధాన సమీక్ష చట్టం ద్వారా మొదలైందే కాబట్టి ప్రభుత్వంతో కూడా చర్చిస్తాం'' అని దాస్ తెలిపారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి చివరి, ఆరో ద్వైమాసిక ద్రవ్య, పరిపతి విధాన సమీక్ష రెపొ రేటును యథాతథంగా 5.15శాతంగా ఉంచింది. రివర్స్ రెపొ రేటును కూడా మార్చకుండా 4.90శాతం వద్దే ఉంచింది. 2019లో ఆర్బీఐ మొత్తంగా 135 బేసిన్ పాయింట్ల మేర కీలక రేట్లను తగ్గించింది. తదుపరి సమీక్ష మార్చి 31, ఏప్రిల్1, 3వ తేదీల్లో జరగునుంది.