Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 811 పాయింట్ల పతనం
- మూడేండ్ల కనిష్టానికి నిఫ్టీ
ముంబయి : కరోనా ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు మరోసారి కుదేలు అయ్యాయి. వరుస నష్టాలతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మూడేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలకు తోడు దేశీయంగా ఎలాంటి సానుకూల అంశాలు కానరాకపోవడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 811 పాయింట్లు పతనమై 30,579కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 230 పాయింట్లు క్షీణించి 8.967కు దిగజారింది. గత మూడేండ్లలో ఎప్పుడూ లేని విధంగా నిఫ్టీ 9వేల దిగువన నమోదైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 31,945-30,745 మధ్య కదలాడగా.. నిఫ్టీ 9,404- 8,916 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభన మదుపర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోననీ, ఇంకెప్పుడు సానుకూలత ఏర్పడుతుందో తెలియక మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా బలహీన వృద్ధి రేటుకు తోడు అమెరికా, ఆసియా, యూరోపియన్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగడంతో మార్కెట్లలో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అంచనాలు మదుపర్లను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. వైరస్ ప్రభావం కొద్ది కాలం ఉన్నప్పటికీ తిరిగి వెంటనే కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము మార్కెట్ల గురించి ఆలోచించడం లేదనీ.. వైరస్ను ఎలా కట్టడి చేయాలన్న దానిపైనే దృష్టి సారించామన్నారు.