Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మధ్య, పేద తరగతి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకునే చిన్న మొత్తాలపై రాను రాను కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతోంది. వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్రం ప్రతిపాదనలు రూపొందించిందని సమాచారం. చిన్న మొత్తాల పొదుపు పతకాలపై అధిక వడ్డీరేట్లు కొనసాగడం వల్ల తాము డిపాజిట్ రేట్లను తగ్గించడం కుదరడం లేదని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఏడాది మెచ్యూరిటీ గల చిన్నమొత్తాలు, బ్యాంకు డిపాజిట్ల మధ్య 100 బేసిస్ పాయింట్ల అంతరం ఉంది. ఈ నేపథ్యంలో చిన్న మొత్తాల వడ్డీ రేట్ల తగ్గింపునకు కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. దీంతో వేగంగా ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతి త్రైమాసికంలో చిన్న మొత్తాలు పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రభుత్వం సమీక్షిస్తుంది. నాలుగో త్రైమాసికానికి గాను 2019 డిసెంబర్ 31న పీపీఎఫ్ కిసాన్ వికాస్ పత్ర 9 శాతం, 113 నెలల్లో మెచ్యూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్రకు 7.6 శాతంగా వడ్డీరేట్లను ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్ వడ్డీ రేట్లను సమీక్షించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్లను యథాతథంగా నిర్ణయించారు. కరోనా ముప్పు నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు అన్ని రకాల వడ్డీరేట్ల కోతలపై నిర్ణయం తీసుకుంటామని గత వారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. చిన్నమొత్తాల పొదుపు రేట్లను తగ్గించి స్థిరమైన వడ్డీరేట్ల సూత్రానికి సమానంగా ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీకి ప్రతిపాదించామని పేర్కొన్న సంగతి తెలిసిందే.