Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 22 నుంచి భారత్లోకి వచ్చే అన్ని రకాల వాణిజ్య విమా నాలను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీ వారం భారత్కు 300 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి ఆదివారం అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్టు వెల్లడించింది. దేశ, విదేశీ విమానయాన కంపెనీలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా ప్రయాణికులు లేకపోవడంతో అనేక విమానయాన కంపెనీలు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఇప్పటికే పలు సేవలను రద్దు చేసుకుంటున్నాయి. ఇండిగో తమ ఉద్యోగుల వేతనాలకు కోత పెట్టనున్నట్టు ప్రకటించగా... మరిన్ని విమానయాన కంపెనీలు అదే బాటలో నిర్ణయం తీసుకోనున్నాయని తెలుస్తోంది.