Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్తో రూ.75కు క్షీణత
న్యూఢిల్లీ : రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. అసలే దేశ ఆర్ధిక వ్యవస్థ బలహీనంగా కొనసాగుతుంటే దానికి తోడు కరోనా వైరస్ తోడవ్వడంతో డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 75 మార్క్ను తాకింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల మేర నష్ట పోయింది. అనంతరం మరింత బలహీనపడి తుదకు 102 పైసలు కోల్పోయి 75.28కి పడిపోయింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతో పాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం సెషన్లో డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్ కనిష్టాన్ని తాకింది.