Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను దేశంలోనే అత్యుత్తమ నిర్వహణ కంపెనీగా ప్రముఖ గ్లోబల్ ఆర్ధిక పత్రిక 'ఫైనాన్స్ ఆసియా' ఎంపిక చేసినట్టు ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. పెట్టుబడిదారులు, విశ్లేషకుల నుంచి నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో అత్యుత్తమ సంస్థగా ఎంపికైనట్టు పేర్కొంది. అదే విధంగా ఆ బ్యాంక్ సారథి అయిన ఆదిత్యా పూరి బెస్ట్ సీఈఓ గా గుర్తించబడ్డారని తెలిపింది.