Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1630 పాయింట్ల పెరుగుదల
ముంబయి : వరుస నష్టాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు వారాంతం రోజున భారీ ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో శుక్రవారం సెన్సెక్స్ 1628 పాయింట్లు లేదా 5.75 శాతం పెరిగి 29,916కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 482 పాయింట్లు రాణించి 8,745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 30,418 వద్ద గరిష్టాన్నీ, 27,933 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ 8,883- 8,178 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి ఉపశమనం లభించగా.. ఆసియాలోనూ పలు మార్కెట్లు 3 శాతం వరకు పెరగడంతో మదుపర్లలో విశ్వాసం పుంజుకుంది. ప్రభుత్వం ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే క్రమంలో మరిన్ని ఉపశమనాలను ప్రకటిస్తుందని విశ్లేషణలు వారాంతం రోజున భారత మార్కెట్లకు మద్దతునిచ్చాయి.
అమెరికా ఇప్పటికే దాదాపు ట్రిలియన్ డాలర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోపక్క చైనా కూడా భారీ ప్యాకేజీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు రాయిటర్స్ కథనంలో పేర్కొంది. మార్కెట్లు నాలుగు రోజుల భారీ పతనాల తర్వాత ఎగబాకడంలో ఆశ్చర్యం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా జరిగే ప్రక్రియేననీ, అమెరికా మార్కెట్లు కూడా ఇటీవల ట్రేడింగ్ నిలిచిపోయే స్థాయిలో నాలుగు సార్లు భారీగా పతనం అనంతరం లాభపడ్డాయి. గురువారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ. 4623 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.