Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓలా, ఉబర్ కంపెనీలు తమ వాహనాల్లో షేరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. కరోనాను నివారించేందుకు సామాజిక దూరాన్ని పాటించాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. చౌకగా ప్రయాణించే ఓలా షేర్ను తాత్కాలికంగా నిలిపేయడం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని ఓలా అభిప్రాయపడింది. ప్రభుత్వ నిబంధనలకు అనుసరిస్తూ 'పూల్ రైడ్' లేదా 'పూల్ సర్వీస్' సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో ఇకపై ఓలా లేదా ఉబర్లో ఒకరు లేదా ఒకే కుటుంబానికి చెందినవారు మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. గతకొన్ని రోజులుగా 'పూల్ సర్వీస్'కు డిమాండ్ బాగా తగ్గిపోయిందని సంస్థలు తెలిపాయి. ప్రజలు ఇతరులతో క్యాబ్ని పంచుకోవడానికి అసలు ఇష్టపడడం లేదని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పూల్ రైడ్ సదు పాయాన్ని రద్దు చేస్తున్నామని వెల్లడించాయి. అలాగే క్యాబ్లలో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఇరు సంస్థలు వేరు వేరుగా తెలిపాయి.