Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ సంక్షోభానికి ఆ సంస్థదే పూర్తి బాధ్యతని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ బిమల్ జలన్ అన్నారు. ఈ బ్యాంక్లో రెండు, మూడేండ్ల ముందే సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. అయితే యాజమాన్యం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. ఓ ఇంటర్యూలో జలన్ మాట్లాడుతూ యస్ బ్యాంక్ సంక్షోభానికి ఆర్బీఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖలను తప్పు పట్టలేమన్నారు. దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్గా ఉన్న యస్ బ్యాంక్పై మార్చి 5న ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే.