Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
ముంబయి : ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన ఖాతాదారుల పట్ల మరోమారు ఊదారత పాటించడంతో పాటుగా ప్రయివేటు బీమా సంస్థలతో పోల్చితే విభిన్న నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా భయాలు పెరుగుతోన్న నేపథ్యంలో తమ ఖాతాదారుల ప్రీమియం చెల్లింపులకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీలపై ఖాతాదారులు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిల చెల్లింపునకు 2020 ఏప్రిల్ 15 వరకు చెల్లించుకోవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావంతో అనేక రాష్ట్రాలు లాకౌట్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.