Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దలాల్ స్ట్రీట్లో రికార్డు పతనం ఆగటం లేదు. కరోనా వైరస్ తీవ్రతరం కావడంతో పలు రాష్ట్రాలు లాకౌట్ ప్రకటించడం, డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోవడం తదితర పరిణామాల మధ్య సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు 10 శాతం కుప్పకూలినప్పటికీ అమ్మకాలు ఆగలేదు. దీంతో ట్రేడింగ్ను తాత్కాలికంగా 45 నిమిషాల పాటు నిలిపి వేశారు. ఉదయం సెన్సెక్స్ ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే 2,991 పాయింట్లు పతనమై 26,924 పాయింట్లకు దిగజారింది. సమయం గడిచేకొద్దీ అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. రికార్డు నష్టాలు కొనసాగుతుంటే కొన్ని సూచీల్లో అమ్మే వాళ్లు తప్పా కొనే వారు లేకుండా పోయారు. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 3,935 పాయింట్లు లేదా 13 శాతం క్షీణించి 25,981కు పడిపోయింది. అదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,135 పాయింట్లు లేదా 13 శాతం విలువ కోల్పోయి 7,610కి దిగజారింది. ఈ దెబ్బతో ఒక్క సెషన్లో బీఎస్ఈలో మదుపర్ల సంపద రూ.13.88 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. మార్కెట్లలో ఇంత భారీ నష్టం చరిత్రలో ఇదే తొలిసారి. గత నెల రోజుల్లో మొత్తంగా రూ.56.22 లక్షల కోట్ల మదుపు విలువను నష్టపోయారు.
ప్రధాన కారణాలు..
8 దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడం.
8 భారత్లో కొవిడ్-19 రెండో దశకు చేరడం.
8 డాలర్తో రూపాయి రికార్డు స్థాయిలో పతనం.
8 విదేశీ మదుపర్లు ఈక్విటీలను తెగనమ్మడం.
8 జపాన్ మినహా ఆసియా మార్కెట్లన్నీ నష్టాలకు గురి కావడం.
8 అమెరికాలో డొజోన్స్ ఫ్యూచర్స్ పతనం.
అన్ని రంగాలూ వెలవెల
మార్కెట్లు ప్రారంభంలోనే భారీ పతనాన్ని చవి చూడటంతో పలు మధ్య, చిన్నతరహా సూచీల అమ్మకాలు ఉధతమయ్యాయి. అంతా అమ్మేవాళ్లే తప్పా కొనుగోలుదారులు కరవు కావడంతో 20 శాతం లోయర్ సర్క్యూట్లను తాకిన సూచీలు ఉన్నాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ సూచీ 13 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 12 శాతం చొప్పున కుదేలయ్యాయి. నిఫ్టీలో అన్ని రంగాలు వెలవెల పోయాయి. ప్రయివేటు బ్యాంకింగ్ సూచీ ఏకంగా 17 శాతం పతనమైంది. యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 28 శాతం కుప్పకూలి రూ.310కి పడిపోయింది. ఆటో రంగం సూచీ 14 శాతం నష్టపోయింది. ఈఎస్ఈలో ట్రేడింగ్ అయిన 2,401 స్టాక్స్ల్లో కేవలం 233 మాత్రమే స్వల్పంగా పెరగ్గా.. 2,036 సూచీలు నష్టపోయాయి. మరో 132 స్టాక్స్్ యథాతథంగా నమోదయ్యాయి. సెన్సెక్స్-30లో అన్నీ నేల చూపులు చూశాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఇండుస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి సూచీలు అత్యధికంగా 28.01 శాతం నుంచి 17.02 శాతం వరకు నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో 857 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. కరోనా భారీ నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి నెలకొనడంతో మదుపరులు అమ్మాకాలకు పాల్పడ్డా రు. పలు కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపి వేయ డంతో ఆ ప్రభావం ఆదాయాలపై పడుతుందనే భయా లు కూడా నెలకొన్నాయి. శుక్రవారం సెషన్లో విదేశీ మదుపర్లు రూ.3346 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
పాతాళానికి రూపాయి..
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. సోమవారం సెషన్లో డాలర్తో రూపాయి మారకం విలువ 109 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేని విధంగా జీవిత కాల కనిష్ట స్థాయి 76.29కి దిగజారింది. కరోనా వైరస్ భయాలకు తోడు దేశ ఆర్ధిక వ్యవస్థలో ఒక్క సానుకూల అంశం కూడా కానరాకపోవడంతో భారత మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులు తరలించుకుపోవడంతో రూపాయి విలువ బిత్తరపోతోంది.