Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్్ 693 పాయింట్ల లాభం
ముంబయి : వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం కాస్త ఉపశమనం లభించింది. కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం అతి తర్వలో కార్పొరేట్లకు ప్యాకేజీని ప్రకటించనుందన్న ఆర్ధిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయి దీనికి తోడు ఆర్థిక స్థిరీకరణకు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ హామీతో ఆసియాతో పాటు యూరప్ మార్కెట్లు రాణించడం విశ్వాసాన్ని పెంచింది. ఈ నేపథ్యంలోనే తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 692.79 పాయింట్ల లాభంతో 26674.03కు చేరింది. నిఫ్టీ 190.80 పాయింట్లు రాణించి 7801.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 7,511.10-8,036.95 కదలాడగా.. సెన్సెక్స్ 25,638.90 - 27,462.87 మధ్య ట్రేడింగ్ అయ్యింది. ఒక్క రియల్టీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కరోనా వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నదని నిర్మలా సీతారామన్ పేర్కొనడటంతో మదుపరులు ఊపిరిపీల్చుకున్నారు.