Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లాక్డౌన్తో అనిశ్చిత పరిస్థితులు
- నిలిచిపోనున్న రూ.22వేల కోట్ల రుణాల మంజూరు
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ కారణంగా సూక్ష్మరుణ రంగంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆర్థిక నిపు ణులు భావిస్తున్నారు. దాంతో సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తీవ్ర ఇక్కట్లకు గురయ్యే అవకాశముందని వారు అంటున్నారు. మైక్రోఫైనాన్స్కు సంబంధించి వసూళ్లు, మంజూరు రెండూ కూడా దేశవ్యా ప్తంగా 80కిపైగా జిల్లాల్లో నిలిచిపోతున్నాయని సమాచారం. పరిశ్రమవర్గాల సమాచారం ప్రకారం, మనదేశంలో డిసెంబరు 2019నాటికి మైక్రోఫైనాన్స్ పరిమాణం రూ.2.11లక్షల కోట్లు. ఇందులో ప్రతినెలా సుమారుగా 10శాతం రుణ చెల్లింపులు ఉంటాయి. తిరిగి అంతే మొ త్తం కొత్త రుణాలు (రూ.22వేల కోట్లు) అందజేస్తుంటారు.
రుణ వసూళ్లు, చెల్లింపు అంతా కూడా 8 నుంచి 10మందితో కూడిన గ్రూపులతో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. నేడు ప్రతి బ్యాంకు సూక్ష్మరుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు, దానితో ముడిపడిన సూక్ష్మ రుణ రంగం కచ్చితంగా ప్రభావితమవుతుందని బ్యాంకిం గ్ రంగ నిపుణులు చెబుతున్నారు. మైక్రోఫైనాన్స్ రంగంలో పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఉన్న ఫలం గా తమ ప్రాధాన్యతలను మార్చుకోవని, అలా మార్చుకోవటం రిస్క్తో కూడుకున్న వ్యవహారమని నిపుణులు తెలిపారు.
రుణ వసూళ్లు ఆగిపోయాయి : రామడుగు, ఎండీ, సీఈఓ 'వాయా'
మైక్రోఫైనాన్స్రంగంలో ఇప్పటికే అనిశ్చిత వాతావర ణం నెలకొంది. దీనికి తోడు ఇప్పుడు లాక్డౌన్ వచ్చిపడిం ది. అనేక రాష్ట్రాల్లో సూక్ష్మరుణ వసూళ్లు, మంజూరు ఆగి పోయాయి. పట్టణాల్లో ఫీల్డ్ ఆపరేటర్లు టెక్నాలజీని ఉప యోగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాపారం దెబ్బతినటం రుణ వసూళ్లపై ప్రభావం చూపుతుంది. లాక్డౌన్ తర్వాత రుణ వసూళ్లు మొత్తం ఆగిపోయాయి. ఈ పరిస్థితులు ఇంకెంత కాలం ఉంటాయో ఎవరికీ అర్థం కావటం లేదు.