Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
న్యూయార్క్ : కరోనా సంక్షోభంతో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి త్వరలోనే బైటపడగలమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ధీమా పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ఆర్థికంగా బలమైన స్థితిలోనే ఉన్నదనీ, మరింత పటిష్టంగా మారగలదన్నారు. ఆర్థిక వ్యవస్థలను కరోనా వైరస్ నుంచి గట్టెక్కించడానికి అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడాన్ని నాదెళ్ల స్వాగతించారు. తాము గతంలో ప్రకటించిన ఉత్పత్తులను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు కొనసాగుతున్నదని తెలిపారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికా, యూరప్, ఇతర సంపన్న దేశాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంటుందనేది... చూడాల్సి ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటి నుంచే పని విధానం పాటిస్తున్న నాదెళ్ల ఈ సందర్భంగా తన ఇంటి ఆఫీస్ విశేషాలను వెల్లడించారు. తన విధుల నిర్వహణలో కుమార్తెలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.