Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాల 1,124 కోట్ల రూపాయలు. వివిధ పనులకు ప్రభుత్వం చేసిన వ్యయం 13,237 కోట్ల రూపాయలు! అంటే ఒక్క నెలలోనే దాదాపుగా 12 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేయాల్సివచ్చింది. ఈ అంకెలు చాలు రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవడానికి! అదనంగా ఖర్చు చేసిన ప్రతి రూపాయి అప్పుగా తీసుకువచ్చిందే ఒక్క మార్కెట్ బారోయిరగ్స్ ద్వారానే తొమ్మిది వేల కోట్ల వరకు రుణాలుగా తీసుకున్నట్లు తెలిసిరది. అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న నిధులను కూడా సమీకరిరచి పలు సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాలన ముందుకు సాగాలంటే అప్పులు చేయక తప్పని స్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఈ నెలలో కూడా ఆదాయం తక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో మరిన్ని అప్పుల కోసం ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఆఫ్ బడ్జెట్ బారోయిరగ్స్పై దృష్టి సారిరచాలని నిర్ణయిరచినట్లు తెలిసిరది. దీనికోసం ఇబ్బడిముబ్బడిగా గ్యారంటీలు కూడా ఇవ్వాలని నిర్ణయిరచిరది. అయితే ఈ గ్యారంటీలకు విలువ ఇచ్చి ఎరతవరకు బ్యారకులు గ్యారంటీ ఇస్తాయన్నది అనుమానంగానే ఉరదని అధికారులే అరటున్నారు. ఇప్పటికే అనేక బ్యారకుల నురచి రుణాలకు వ్యతిరేకత వస్తురడడం, పాత బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తురడడం, చివరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రుణ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. దీంతో అవసరమైతే కేంద్రం ద్వారా రుణదాతలపై ఒత్తిడి తేవాలని కూడా యోచిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల రుణ అవకాశాలపైనా దృష్టి సారిస్తామని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వ్యాఖ్యానిరచారు. త్వరలోనే పరిస్థితి మారే అవకాశం ఉందన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పలు సంక్షేమ పథకాలు, వైద్యం, పింఛన్లు, విద్యాదీవెన, స్వయర సహాయ సంఘాలు వంటి వాటికే ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి వచ్చిరదని ఆయన వివరిరచారు.