Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మొండి బాకీలు పెరుగొచ్చు
- బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్లకు రూ.1 లక్ష కోట్ల పైన మూలధనం అవసరం కావొచ్చని ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ ఒక్కటి అంచనా వేసింది. లాక్డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీఎస్బీ)ల మొండి బాకీలు 2-4 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఒఎఫ్ఎ) సెక్యూరిటీస్ అంచనా వేసింది. నిరర్ధక ఆస్తులు పెరిగితే ఆయా బ్యాంక్లకు 7-15 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.53వేల కోట్ల నుంచి రూ.1.14 లక్షల కోట్లు) అవసరమని తెలిపింది. కేంద్రం పిఎస్బిలకు మూలధనాన్ని అందించడం, రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చవచ్చని పేర్కొంది. తగిన మూలధన అవసరాలు తీరి బ్యాంక్లు కోలుకున్న తర్వాత ప్రభుత్వం క్రమంగా ఈ రీక్యాపిటలైజేషన్ బాండ్లను సాధారణ జీసెక్లుగా మార్చి మార్కెట్లో విక్రయించవచ్చని బీఒఎఫ్ఎ పేర్కొంది. ఉద్దీపన ఖర్చులు పెరగడం, పన్ను వసూళ్లు తక్కువగా ఉండడం, ఏకీకత ఆర్థిక లోటు లక్ష్యం 2 శాతం పెరిగే అవకాశం ఉన్నందున రీకాపిటలైజేషన్ కోసం వనరులను పెంచడానికి వివిధ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ బ్యాంకులకు సాయం చేయడానికి కేంద్రం రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం, ఆర్బిఐ వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల భారీ నిల్వలను పునర్వినియోగ అవసరాలకు ఉపయోగించవచ్చని సూచించారు.