Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు
- డిపాజిట్లపై కోత
- సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పథకం
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తమ ఖాతాదారులకు ఒక్కటి చేదు, రెండు తీపి కబుర్లను ప్రకటించింది. రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లను తగ్గించగా.. డిపాజిట్దార్ల ఫిక్సుడ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీకి కోత పెట్టింది. మరోవైపు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఖాతాదారులు పొందిన అన్ని రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న వడ్డీ రేటు 7.25 శాతానికి తగ్గనుంది. ఎంసిఎల్ఆర్తో అనుసంధానం కలిగిన రుణాలను తీసుకున్న వారికి ఈ వడ్డీ తగ్గింపు ఫలాలు అందనున్నాయి. మే 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయని ఎస్బిఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎంసిఎల్ఆర్లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని ఆ బ్యాంకు వెల్లడించింది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలపరిమితి కలిగిన రూ.25 లక్షలు గహ రుణం తీసుకున్న ఖాతాదారుడికి నెలవారి వాయిదా చెల్లింపుల్లో సుమారు రూ.255 తగ్గనుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
రుణాలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కాల వ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. మే 12 నుంచి ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఎఫ్డిలపై రేట్లను తగ్గించడం రెండు నెలల్లో ఇది మూడోసారి. సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లను కూడా గత నెలలోనే తగ్గించింది. వ్వవస్థలో, బ్యాంకులో తగినంత ద్రవ్యత దష్ట్యా ఎఫ్డిలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎస్బిఐ తెలిపింది.
కొత్తగా వీ కేర్ డిపాజిట్ స్కీమ్
సీనియర్ సిటిజన్లను ఆకర్శించేందుకు వారి కోసం ప్రత్యేకంగా 'ఎస్బిఐ వీ కేర్ డిపాజిట్ స్కీం'ను ఆవిష్కరించినట్లు ఎస్బిఐ తెలిపింది. ఇది ఇతర పథకాలతో పోల్చితే ఇందులో సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందుతుందని పేర్కొంది. దీని కింద ఐదేళ్లు, ఆపైన కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది.