Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ వితరణను పెంచుకోవడానికి 'ఎమర్జెన్సీ లోన్ స్కీమ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఆ బ్యాంక్ తెలిపింది. నెలసరి వాయిదా చెల్లింపులు (ఇఎంఐ) కూడా ఆర్నెల్ల తర్వాత ప్రారంభమవుతాయి. కరోనా లాక్డౌన్ కష్టాల నేపథ్యంలో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్బిఐ వర్గాలంటున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందేందుకు ఎస్బిఐ యోనో యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఖాతాదారులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి పీఎపీఎల్ అని టైప్ చేసి, మీ బ్యాంకు ఖాతా నంబరులోని చివరి నాలుగు అంకెలను కూడా జతచేసి 567676 నంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే ఈ ఎమర్జెన్సీ లోన్ స్కీమ్కు అర్హులో కాదో తెలిసిపోతుంది.