Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రూ.25వేల కోట్ల నిధుల సమీకరణ..!
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ గడిచిన ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 26.03 శాతం వృద్ధితో రూ.1,221.36 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.969.06 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం రూ.7,620.06 కోట్లుగా ఉండగా.. గడిచిన త్రైమాసికంలో రూ.8,927 కోట్లుగా చోటు చేసుకుంది. క్రితం మార్చి 31 నాటికి బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 5.53 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే కాలం నాటికి ఈ ఎన్పిఎలు 6.70 శాతంగా ఉన్నాయి. గడిచిన త్రైమాసికంలో రూ.5,967 కోట్ల ప్రొవిజన్లు కేటాయించింది. ఇందులో కరోనా సంబంధిత ప్రొవిజన్లు రూ.2,725 కోట్లుగా ప్రకటించింది. ఇంతక్రితం డిసెంబర్ త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.2,083గా కోట్ల కేటాయింపులు చేసింది. రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. దేశీయంగా నాన్ కన్వర్టేబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని నిర్ణయించింది.