Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : లాక్డౌన్తో సుమారు రెండు నెలలు మూతపడిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్వైఎస్ఈ) మంగళవారం పాక్షికంగా తెరుచుకుంది. ఎన్వైఎస్ఈ అధ్యక్షుడు స్టాసీ కున్నింగమ్తో కలిసి న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ అండ్రూ కౌమో గంట మోగించి ఎక్స్చేంజ్ను ప్రారంభించారు. నూతన భద్రతా చర్యలతో, చాలా జాగ్రత్తగా ఎక్స్చేంజ్ను ప్రారంభిస్తున్నట్టు కున్నింగమ్ తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు భవనంలో ప్రవేశించే వారందరీ ఉష్ణోగ్రతలు నమోదు చేస్తామని తెలిపారు. మార్చి 23న ఎన్వైఎస్ఈను మూసివేశారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. 50 రాష్ట్రాల్లోనూ నిబంధనలు సడలిస్తున్నారు. అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటింది.