Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేట్ రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంక్లో గ్లోబల్ పీఈ సంస్థ కార్లయిల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని సమాచారం. ప్రిఫరెర్షియల్ షేర్ల కేటాయింపుల ద్వారా రూ.7500 కోట్లు (100 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయనుందని ఈటీ ఓ కథనంలో పేర్కొంది. తద్వారా యాక్సిస్ బ్యాంకులో అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న కార్లయిల్కు 8 శాతం వరకూ వాటా దక్కనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్కు భారీ డిమాండ్ నెలకొంది.
బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ యాక్సిస్ షేర్ 13.46 శాతం పెరిగి రూ.387.35 వద్ద ముగిసింది. దేశంలో నెలకొన్న తీవ్ర మాంద్యానికి తోడు కరోనాతో విత్త సంస్థలకు మూలధనం కొరత ఏర్పడింది. ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ కూడా నిధుల సమీకరణపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది.