Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై మరోమారు వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఎఫ్డీలపై 40 బేసిస్ పాయింట్లు లేదా 0.4 శాతం వడ్డీ రేటు కోత పెట్టింది. ప్రస్తుత నెలలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండో సారి. మే 27 నుంచే సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. దీంతో ఇకపై 7 నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 2.9 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది. 46 నుంచి 179 రోజులు 3.9 శాతం, 180 నుంచి ఏడాది వరకు 4.4 శాతం, ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు 5.1 శాతం, మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు 5.3 శాతం, ఐదేండ్ల నుంచి పదేండ్ల వరకు 5.4 శాతం చొప్పున వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. కాగా సీనియర్ సిటిజన్లకు మాత్రం 50 బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. దీంతో 3 నుంచి ఐదేండ్ల వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్లు 5.8 శాతం శాతం వడ్డీ పొందనున్నారు.