Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సీతారామన్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : ఇకపై ఆధార్ ఆధారిత కేవైసీతో తక్షణమే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డ్ను పొందవచ్చును. గురువారం దీన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంచనంగా ఆవిష్కరించారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా తక్షణ పాన్ కార్డును అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఐడీఏఐలో నమోదైన మొబైల్ నెంబర్, ఆధార్ను ప్రామా ణికంగా తీసుకుని కేవలం 10 నిమిషాల్లోనే ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) జారీ చేస్తారు. దీనికి ఎలాంటి కాగితపు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐటీ శాఖలోని ఇ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా అత్యంత సులభంగా దీన్ని పొందవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికే ట్రయల్ పద్దతిలో 6.7 లక్షల మందికి ఈ ఇన్స్టంట్ పాన్కార్డ్ను అందించారు. ఇప్పటి వరకు దేశంలో 50.52 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి.