Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో పెట్టుబడులకు మరో రెండు దిగ్గజ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్తో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని తెలుస్తోంది. అబుదాబీకి చెందిన ముబదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా బిలియన్ డాలర్ల (రూ.7500 కోట్లు) పెట్టుబడికి ఆసక్తిగా ఉందని సమాచారం. ఈ మేరకు ఆయా సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. గత నెల రోజుల్లో ఫేస్బుక్ నుంచి ప్రారంభమైన పెట్టుబడులతో జియో ఇప్పటికే పలు కంపెనీల నుంచి 10 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.78వేల కోట్లు) సమీకరించింది. మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. దీనిపై రిలయన్స్ వర్గాలు స్పందించలేదు.