Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిసిల్ రీసెర్చ్ రిపోర్టు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతను ఎదుర్కోవచ్చని క్రిసిల్ రీసెర్చ్ ఒక రిపోర్టులో అంచనా వేసింది. ప్యాసింజర్, వాణిజ్య వాహన అమ్మకాలు 2009-10 నాటి కనిష్టానికి పడిపోయే అకాశం ఉందని పేర్కొంది. లాక్డౌన్ విధింపు, పొడగింపులతో పట్టణ ఆదాయలు భారీగా క్షీణించాయని క్రిసెల్ రీసెర్చ్ విశ్లేషకులు హతల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రభావం వాహన పరిశ్రమపై పడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన అమ్మకాలు 26-28శాతం, పాసింజన్ వాహనాల విక్రయాలు 24-26శాతం క్షీణించే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. కాగా ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం స్వల్పంగా 7-9శాతం పడిపోవచ్చని పేర్కొంది.