Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : గడిచిన ఆర్ధిక సంవత్సరం (2019-20)లో జీడీపీ వృద్ధి రేటు 4.2 శాతానికి తగ్గి 11 ఏండ్ల కనిష్టానికి పడిపోవడం పట్ల ఎస్బీఐ స్పందించింది. ఈ వృద్ధిలోనూ ఇతర రంగాలతో పోల్చితే వ్యవసాయ రంగమే ప్రధాన మద్దతును అందించిందని ఎస్బీఐ ఎకోరప్ శనివారం తన రిపోర్టులో పేర్కొంది. ఇంతక్రితం ఏడాది వ్యవసాయ రంగం 2.4 శాతం వృద్ధిని కనబర్చితే.. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో 4 శాతం పెరిగిందని విశ్లేషించింది. దీర్ఘకాలంగా లాక్డౌన్ కొనసాగించడం ద్వారా వృద్ధి రేటు మరింత క్షీణించనుందని పేర్కొంది. జీవితాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత తెలివిగా లాక్డైన్ ఎత్తివేత ప్రణాళిక ఉండాలని సూచించింది.