Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే ప్రముఖ బిలియనీర్లలో ఒక్కరైనా గౌతమ్ అదానీ తన గ్రూప్లోని విద్యుత్ రంగ కంపెనీ అయినా అదానీ పవర్ను స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇందుకు వీలుగా కంపెనీ ఈక్విటీ షేర్ల బైబ్యాక్ మార్గాన్ని ఎంపిక చేసుకోనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ పవర్ డీలిస్టింగ్ ప్రతిపాదనపై తదుపరి కంపెనీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నటు తెలియజేశాయి. బైబ్యాక్ ద్వారా కంపెనీలో మిగిలిన వాటాను కొనుగోలు చేసే వ్యూహంలో ప్రమోటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల ద్వారా అదానీ పవర్ 12,410 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. అదానీ పవర్లో దాదాపు 75 శాతం వాటా ప్రమోటర్ల చేతిలో ఉంది.