Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్ మాసంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏకంగా 87 శాతం పతనమై రూ.5,934 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఏకంగా రూ.46,848 కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యింది. మార్చి 2 నుంచి దేశంలో లాక్డౌన్ అమల్లో ఉంది. ఇది జూన్ చివరి వరకు కొనసాగే అవకాశాలు ఉంది. కాగా ఏప్రిల్లో పూర్తి లాక్డౌన్ అమల్లో ఉండటంతో జీఎస్టీ వసూళ్లు అమాంతం పడిపోయాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రూ.5 కోట్ల టర్నోవర్ లోపు సంస్థలకు ఏకంగా జూన్ చివరి వారం వరకు రిటర్న్లు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో చాలా మంది పన్ను చెల్లింపులు చేయలేదని తెలిపాయి.