Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐకి అశ్విని భాటియా
న్యూఢిల్లీ : మూడు ప్రభుత్వ రంగ బ్యాంక్లకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్లను తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి మేనే జింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అశ్విని భాటియా నియమితులు కానున్నారు. అలాగే, సెంట్రల్ బ్యాంక్ ఎండీగా ఎంవి రావ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా పిపి సేన్గుప్తాల పేర్లను సిఫారసు చేస్తూ సోమవారం బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మూడు బ్యాంక్లకు ఎండిలను నియమించేందుకు 30 మంది అర్హుల జాబితాను వడపోసిన తర్వాత ముగ్గురి పేర్లను తుదకు నిర్ణయించినట్టు పేర్కొంది.