Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమాన కంపెనీలకు డీజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భౌతిక దూరం నిబంధనలు పాటించేలా విమా నాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలంటూ విమాన యాన సంస్థలకు సోమవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సవిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. మధ్య సీట్లను ఖాళీగా ఉంచితే, టికెట్ ధరలను నియంత్రించడం కష్టం అవుతుందని గతంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఒకవేళ మధ్య సీట్లను ప్రయాణికులకు కేటాయిస్తే, ఆ సీట్లలో కూర్చున్నవారు రక్షణ పరికరాలు ధరించాలని డీజీసీఏ పేర్కొంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉంటే, వారు వరుసగా కూర్చుకునేందుకు డీజీసీఏ అవకాశం కల్పించింది.