Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : జివికె గ్రూపులోని అన్ని కంపెనీల్లోని ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో గడిచిన మే మాసంలో వివిధ స్థాయిల్లోని తమ సిబ్బంది వేతనాల్లో 10 నుంచి 30 శాతం తగ్గించినట్టు జివికె గ్రూపు తెలిపింది. దాదాపుగా రెండు నెలల పాటు వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇంధన, రిసోర్సేస్, విమానాశ్రయాలు, రవాణ, హాస్పిటాలిటీ, లైఫ్ సైన్సెస్ వ్యాపారాలు కలిగిని జివికె గ్రూపులో దాదాపుగా 1800 మంది పని చేస్తున్నారు. సీనియర్ అధికారుల వేతనాల్లో అత్యధికంగా 30 శాతం కోతలు పెట్టింది.