Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నరు : లాక్డౌన్ దెబ్బతో వస్త్రాలకు డిమాండ్ పడిపోవడంతో మే ముగింపు నాటికి దేశంలోని కేవలం 22 శాతం గార్మెంట్ ఫ్యాక్టరీలు కార్యకలాపాలను ప్రారంభించాయని క్లాతింగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఎఐ) తెలిపింది. ఇందులోనూ అత్యధికంగా మాస్క్లు, పీపీఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని పేర్కొంది. తాము నిర్వహించిన సర్వేలోనూ తెరుచుకున్న ఫ్యాక్టరీలోనూ 25 శాతం మాత్రమే ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. గతేడాదితో పోల్చితే రెవెన్యూలో 84 శాతం తగ్గుదల చోటు చేసుకున్నట్లు సీఎంఎఐ పేర్కొంది. ఈ రంగానికి చెందిన వ్యాపారుల్లో కేవలం 26 శాతం మంది మాత్రమే కోవిడ్ రుణ మద్దతును పొందారనీ.. మిగితా 74 శాతం సంస్థల దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయని వెల్లడించింది.