Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల్లో రోడ్డున పడిన సిబ్బంది
న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల కోట్లాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గడిచిన మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే దాదాపుగా 12.4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఓ ఆంగ్లపత్రిక విశ్లేషించింది. ఇందులోనూ అత్యధికంగా అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారాలు, దినసరి కార్మికులే ఎక్కువగా ఉన్నారు. స్వయం ఉపాధి కలిగిన వారు కూడా చాలా మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో నిరుద్యోగం అమాంతం పెరిగిపోయింది. లాక్డౌన్ ఆంక్షలు సులభతరం చేయడంతో తిరిగి మే నెలలో 2.1 కోట్ల మంది మాత్రమే ఉపాధి లేదా ఉద్యోగాలు పొందారు.