Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి త్రైమాసికంలో 31 శాతం పతనం
న్యూఢిల్లీ : లాక్డౌన్ వల్ల అనేక వ్యాపారాలు పడిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులోనూ కోతలు పడుతున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ముందస్తు స్థూల పన్నుల చెల్లింపులు 31 శాతం పతనం కాగా.. కార్పొరేట్ల పన్నుల రాబడిలో 79 శాతం తగ్గాయని మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. క్రితం క్యూ1లో ముందస్తు స్థూల పన్ను వసూళ్లు 31 శాతం తగ్గి రూ.1,37,825 కోట్లకు పరిమితమయ్యాయి. 2019 ఇదే జూన్ త్రైమాసికంలో రూ.1,99,755 కోట్ల వసూళ్లు జరిగాయి. గడిచిన త్రైమాసికంలో ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో 80 శాతం మేర వ్యాపారాలు లాక్డౌన్లో ఉండటంతో ఆర్ధిక కార్యకలపాలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ఎక్కువగా పన్ను వసూళ్లపై పడినట్టు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించకపోవడం గమనార్హం.